AP Govt: ఈ వారంలోనే ధాన్యం బకాయిల సొమ్ము విడుదల
ABN , Publish Date - Jul 09 , 2025 | 05:43 AM
రైతులకు ధాన్యం బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజా పంపిణీ అవసరాల కోసం పౌరసరఫరాల సంస్థ ద్వారా గత రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి మద్దతు ధరను రైతుల ఖాతాల్లో జమ చేయడంలో....
అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): రైతులకు ధాన్యం బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజా పంపిణీ అవసరాల కోసం పౌరసరఫరాల సంస్థ ద్వారా గత రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి మద్దతు ధరను రైతుల ఖాతాల్లో జమ చేయడంలో జాప్యం కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి ఏపీ మార్క్ఫెడ్ ద్వారా రూ.1,000 కోట్లు రుణం తీసుకోవడానికి అనుమతిస్తూ ఈ నెల 4న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిధులు వచ్చిన వెంటనే ధాన్యం బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేసేలా పౌరసరఫరాల సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ వారంలోనే రైతుల ఖాతాల్లో ఽధాన్యం బకాయిల సొమ్ములు జమ కానున్నాయి.