అంధకారంలో ప్రభుత్వ కార్యాలయాలు
ABN , Publish Date - May 26 , 2025 | 11:54 PM
మండల కేంద్రంలోని తహసీల్దార్, ఎమ్మార్సీ కార్యాలయాల్లో విద్యుత షార్ట్సర్క్యూట్తో కంప్యూటర్లు కాలిపోయాయి.
విద్యుత షార్ట్సర్క్యూట్తో
కాలిపోయిన కంప్యూటర్లు
చాగలమర్రి, మే 26 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని తహసీల్దార్, ఎమ్మార్సీ కార్యాలయాల్లో విద్యుత షార్ట్సర్క్యూట్తో కంప్యూటర్లు, ఎలకి్ట్రక్ వ స్తువులు శనివారం రాత్రి కాలిపోయాయి. ఆదివా రం సెలవు కావడంతో సోమవారం కార్యాలయా నికి వచ్చి రెవెన్యూ సి బ్బంది తలుపులు తెరవగా కంప్యూటర్లు, విద్యుత బల్బులు వెలగలేదు. ఫ్యాన్లు తిరగలేదు. అంధకారం నెలకొంది. సాయంత్రం వరకు విద్యుత స రఫరా లేకపోవడంతో సెల్ఫోనల ద్వారా విధులు నిర్వహించాల్సి వచ్చింది. అలాగే ఎమ్మార్సీ కార్యాలయంలో మూడు కంప్యూటర్లు కాలిపోయాయి. విద్యాశాఖకు సంబంధించిన డేటా ఉంటుందో లేదోనని ఆ శాఖ అధికారు లు ఆందోళన చెందుతున్నారు. విద్యుత శాఖ ఏఈ రమణయ్య స్పందించి ఆయా కార్యాలయాలకు విద్యుత సరఫరా కల్పించేందుకు తగు చర్యలు తీసుకున్నారు.