Godavari River: పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
ABN , Publish Date - Jun 30 , 2025 | 03:07 AM
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ఉప నదులు, కొండవాగుల వరద గోదావరిలో కలిసి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. అదనంగా వస్తున్న జలాలను పోలవరం ప్రాజెక్టు...
పోలవరం, జూన్ 29(ఆంధ్రజ్యోతి): ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ఉప నదులు, కొండవాగుల వరద గోదావరిలో కలిసి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. అదనంగా వస్తున్న జలాలను పోలవరం ప్రాజెక్టు స్పిల్వే 48 గేట్లు, స్పిల్వేలో 6 స్లూయిజ్ గేట్ల నుంచి దిగువకు విడిచిపెడుతున్నారు. 28,879 క్యూసెక్కుల జలాలను విడుదల చేసినట్టు అధికారులు ఆదివారం తెలిపారు. స్పిల్వే ఎగువన 26.090 మీటర్లు, దిగువన 17.290 మీటర్లు, ఎగువ, దిగువ కాపర్ డ్యాంల మధ్య 15,320 మీటర్ల నీటిమట్టం నమోదైంది.