YS Sharmila: రైతుల యూరియా కష్టాలు వర్ణనాతీతం
ABN , Publish Date - Aug 24 , 2025 | 06:27 AM
రాష్ట్రంలో రైతుల యూరియా కష్టాలు వర్ణణాతీతం. ఏ రైతును కదిలించినా ఎరువుల కోసం కన్నీటి వ్యథే అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...
కోటా మేరకు రాష్ట్రానికి వచ్చింది ఏమైంది?: షర్మిల
అమరావతి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో రైతుల యూరియా కష్టాలు వర్ణణాతీతం. ఏ రైతును కదిలించినా ఎరువుల కోసం కన్నీటి వ్యథే’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ‘తెల్లవారుజాము నుంచే ఎరువుల కేంద్రాల దగ్గర కిలోమీటర్ల మేర క్యూలు. కట్ట యూరియా కోసం రోజుల తరబడి రైతుకు ఎదురు చూపులు. రైతాంగం మీద కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఇదేనా? రైతు సేవా, మార్క్ఫెడ్, సొసైటీ కేంద్రాల దగ్గర యూరియా నో స్టాక్ బోర్డులు పెట్టడానికి సిగ్గుండాలి. రాష్ట్ర కోటా మేరకు వచ్చిన యూరియా స్టాక్ ఏమైంది? 6.34 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా చేరితే రైతులకు ఎందుకు కష్టాలు తప్పలేదు? సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి’ అని శనివారం ఆమె ఎక్స్లో పేర్కొన్నారు.