Remand Extension: నకిలీ మద్యం నిందితులకు రిమాండ్ పొడిగింపు
ABN , Publish Date - Dec 10 , 2025 | 06:37 AM
నకిలీ మద్యం కేసులో వివిధ జైళ్లలో ఉన్న నిందితులకు విజయవాడ ఆరో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు...
విజయవాడ, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం కేసులో వివిధ జైళ్లలో ఉన్న నిందితులకు విజయవాడ ఆరో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి జి.లెనిన్బాబు 18 వరకు రిమాండ్ను పొడిగించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు, మాజీ మంత్రి జోగి రమేశ్, రాము సోదరులు, తిరుమలశెట్టి శ్రీనివాసరావుతో పాటు కొంతమంది నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్నారు. మొత్తం 17 మంది నిందితులను జైలు అధికారులు వర్చువల్గా న్యాయాధికారి ఎదుట హాజరుపరిచారు.