Global Logistics Hub: నేడు విశాఖలో ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ సదస్సు
ABN , Publish Date - Sep 02 , 2025 | 05:31 AM
ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సు మంగళవారం విశాఖపట్నంలో జరగనుంది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు.
హాజరుకానున్న సీఎం చంద్రబాబు
విశాఖపట్నం, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సు మంగళవారం విశాఖపట్నంలో జరగనుంది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో 20 కంపెనీలకు చెందిన సీఈఓలతో ఆయన సమావేశమవుతారు. మారిటైమ్ రంగానికి చెందిన ఆరు స్టార్ట్పల నిర్వాహకులతోను చంద్రబాబు సంభాషిస్తారు. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్గా మార్చేందుకు ఈ సదస్సు దోహదపడుతుంది. ఎయిర్ కార్గో ఫోరం ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ను కూడా సీఎం ప్రారంభించనున్నారు.