Share News

శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు

ABN , Publish Date - Oct 23 , 2025 | 11:24 PM

గ్రామీణ ప్రాం తా ల్లో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ రామాంజీ నాయక్‌ హెచ్చరించారు.

 శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు
మాట్లాడుతున్న డీఎస్పీ రామాంజి నాయక్‌

కొత్తపల్లి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాం తా ల్లో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ రామాంజీ నాయక్‌ హెచ్చరించారు. గురువారం రాత్రి మండలంలోని వీరాపురం గ్రామ బస్టాండు సెంటరులో శాంతిభద్రతలు, సైబర్‌ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రూరల్‌ సీఐ సురేష్‌ కుమార్‌ రెడ్డి, కొత్తపల్లి ఎస్‌ఐ జయశేఖర్‌, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 11:24 PM