Pithapuram: శ్రీపాదశ్రీవల్లభుడే సోదరుడు
ABN , Publish Date - Aug 09 , 2025 | 06:09 AM
రాఖీ పండుగ రోజున సాధారణంగా మహిళలు తమ సోదరులకు రాఖీలు కడతారు. కానీ మహారాష్ట్ర, ఉత్తరాది రాష్ట్రాల మహిళా భక్తులు శ్రీపాదశ్రీవల్లభుడికి శ్రీపాద...
రాఖీ కట్టేందుకు పిఠాపురానికి మహారాష్ట్ర, ఉత్తరాది భక్తుల రాక
పిఠాపురం,ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): రాఖీ పండుగ రోజున సాధారణంగా మహిళలు తమ సోదరులకు రాఖీలు కడతారు. కానీ మహారాష్ట్ర, ఉత్తరాది రాష్ట్రాల మహిళా భక్తులు శ్రీపాదశ్రీవల్లభుడికి శ్రీపాద శ్రీవల్లభుడికి రాఖీలు కడతారు.ఇందుకోసం నాలుగైదు రోజులు ముందుగానే కాకినాడ జిల్లా పిఠాపురం చేరుకుని శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో జరిగే పూజల్లో పాల్గొంటారు.శనివారం శ్రావణ (రాఖీ) పౌర్ణమి కాగా శుక్రవారం రాత్రికే పిఠాపురం పరిసర ప్రాంతాల్లోని లాడ్జీలు, అతిథి గృహాలు భక్తులతో నిండిపోయాయి.