Eluru District: నేడు ఐ.ఎస్. జగన్నాథపురానికి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ABN , Publish Date - Nov 24 , 2025 | 04:58 AM
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం ఐ.ఎస్.జగన్నాథపురంలోని నరసింహస్వామి క్షేత్రంలో పలు అభివృద్ధి పనులకు...
ఏలూరు, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం ఐ.ఎస్.జగన్నాథపురంలోని నరసింహస్వామి క్షేత్రంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం శ్రీకారం చుట్టనున్నారు. ఇటీవల ఆలయానికి ప్రభుత్వం మంజూరు చేసిన 30 ఎకరాల భూమి కేటాయింపు పత్రాలను అధికారులకు అందజేసి, అక్కడే అభివృద్ధి పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అలాగే ఐ.ఎస్.జగన్నాథపురం గ్రామంలో 120 మీటర్ల మేర అభివృద్ధి చేసిన పంచాయతీరాజ్ మ్యాజిక్ డ్రెయిన్ను పరిశీలిస్తారు.