Share News

AP Govt: దీపం-ఉజ్వల జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు

ABN , Publish Date - Oct 07 , 2025 | 06:09 AM

ప్రధానమంత్రి ఉజ్వల యోజన, దీపం-2 పథకాల అమలు తీరును పర్యవేక్షించడానికి ప్రభుత్వం జిల్లాస్థాయి దీపం-ఉజ్వల కమిటీ(డీడీయూసీ)లను ఏర్పాటు చేసింది.

AP Govt: దీపం-ఉజ్వల జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ‘దీపం-2’ పథకాల అమలు తీరును పర్యవేక్షించడానికి ప్రభుత్వం జిల్లాస్థాయి దీపం-ఉజ్వల కమిటీ(డీడీయూసీ)లను ఏర్పాటు చేసింది. కమిటీకి జిల్లా కలెక్టర్‌ (పౌరసరఫరాలు) లేదా ఆయన సూచించిన సీనియర్‌ అధికారి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ ఆ జిల్లాకు కేటాయించిన ప్రతినిధి మెంబరు కో-ఆర్డినేటర్‌గా ఉంటారు. ఇతర ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల (ఐవోసీఎల్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, మహారత్న ప్రభుత్వ రంగ సంస్థల)కు చెందిన అధికారులు, జిల్లా ఆహార,పౌరసరఫరాల అధికారి, అనధికారులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు పౌరసరఫరాల కమిషనర్‌, ప్రభుత్వ ఎక్స్‌-అఫిషియో సెక్రటరీ సౌరభ్‌గౌర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Oct 07 , 2025 | 06:09 AM