Share News

రసాభాసగా కౌన్సిల్‌ సమావేశం

ABN , Publish Date - Jun 19 , 2025 | 11:50 PM

పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన సప్తశైల రాజేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశం రసాభాసగా జరిగింది.

రసాభాసగా కౌన్సిల్‌ సమావేశం
మాట్లాడుతున్న చైర్మన సప్తశైల రాజేష్‌

పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాదన

డోన టౌన, జూన 19 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన సప్తశైల రాజేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశం రసాభాసగా జరిగింది. వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాదనలు చేయగా.. పట్టణంలోని పలుచోట్ల ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన బంకులను తొలగించాలని టీడీపీ ప్రస్తుత ప్రభుత్వం కౌన్సిలర్లే నిలదీయడం ఆశ్చర్యానికి గురిచేసింది. పట్టణంలోని రోడ్లు, మౌలిక సదు పాయాలు కల్పించాలని, ఇబ్బందులు లేకుండా తాగునీరు ఇవ్వాలని, సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని, కుక్కల నియంత్రణకు చ ర్యలు తీసుకోవాలని సభా దృష్టికి తీసుకవచ్చారు. సమావేశంలో కమిష నర్‌ ప్రసాద్‌గౌడు, వైస్‌ చైర్మన కోట్రికే హరికిషన, కోఆప్షన మెంబర్‌ కుమ్మరి రాజు, సీపీఐ కౌన్సిలర్‌ సుంకయ్య, టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2025 | 11:50 PM