NAKSHA Implementation: నక్ష అమలుకు సమన్వయ కమిటీలు
ABN , Publish Date - Sep 06 , 2025 | 06:26 AM
నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జి బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హేబిటేషన్ (నక్ష) అమలుకు రాష్ట్ర, పట్టణ స్థానిక సంస్థల సమన్వయ...
అమరావతి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జి బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హేబిటేషన్ (నక్ష) అమలుకు రాష్ట్ర, పట్టణ స్థానిక సంస్థల సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీకి సీసీఎల్ఏ చైర్పర్సన్గా, సీడీఎంఏ, డీటీసీపీ, డైరెక్టర్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్, ఏపీ, తెలంగాణ జియో స్పేషియల్ డైరక్టరేట్ డైరెక్టర్, జీఐఎస్ టెక్నికల్ నిపుణులు, జీఐఎస్ ఇంజనీర్లు సభ్యులుగా, అడిషనల్ సీసీఎల్ఏ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు.