సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి: మంత్రి
ABN , Publish Date - Jun 16 , 2025 | 12:39 AM
సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు.
బనగాన పల్లె, జూన 15( ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలనుంచి వినతులను స్వీకరించారు. వివిధ గ్రామాల నుంచి ప్రజలు, బాధితులు, కార్యకర్తలు, అఽధికారులు మంత్రి క్యాంపు కార్యాలయానికి తరలివచ్చి సమస్యలను విన్నవించారు. ప్రజలు, బాఽధితుల వినతులు స్వీకరించి అప్పుటికప్పుడే కొన్ని సమస్యలను అధికా రులకు ఫోనలు చేసి పరిష్కరించారు. కొన్ని సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కరించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే అధికారులు, ఉద్యోగులు అధికంగా మంత్రిని కలుసుకొని తమ సమస్యల ను పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా పొలం వివాదాలు, వ్యక్తిగత సమస్యలు మంత్రి దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు. ప్రజలను కార్యాల యాల చుట్టూ తిప్పవద్దని, అలాంటి అఽధికారులపై చర్యలు తీసుకుంటామ న్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రజలకు సేవలందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.