రీసర్వే సకాలంలో పూర్తి చేయండి
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:00 AM
రీసర్వేను సకాలంలో పూర్తి చేయాలని ఆర్డీవో నరసింహులు అన్నారు.
డోన టౌన, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): రీసర్వేను సకాలంలో పూర్తి చేయాలని ఆర్డీవో నరసింహులు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో డోన డివిజనస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ నిర్దేశిత సమయం లోగా రీసర్వేను పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో తహసీల్దార్లు నాగమణి, ప్రకాశబాబు, భారతి, డిప్యూటీ తహసీల్దార్లు సునీల్ రాజా, మండల సర్వేయర్ జగదీశ, సిబ్బంది పాల్గొన్నారు.