MLA Kalva Srinivasulu: కూటమి పాలనలో పెట్టుబడుల వరద
ABN , Publish Date - Dec 11 , 2025 | 03:43 AM
రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడిదారులకు నమ్మకం పెరిగిందని, పెట్టుబడులు గణనీయంగా...
అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడిదారులకు నమ్మకం పెరిగిందని, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చొరవతో 18 నెలల్లోనే రూ.25 లక్షల కోట్లు పెట్టుబడులు, 26 లక్షల ఉద్యోగవకాశాలు రానున్నాయని తెలిపారు. జగన్ అసమర్థ పాలనలో 24కి పెరిగిన నిరుద్యోగిత శాతం నేడు 8.2 శాతానికి తగ్గిందని అన్నారు.