Share News

CM Reviews NTR Memorial Project: తెలుగు వైభవంగాఎన్టీఆర్‌ స్మృతివనం

ABN , Publish Date - Sep 14 , 2025 | 03:54 AM

తెలుగువారి ఆత్మగౌవరం, ఆత్మవిశ్వాసం కలగలిపి తెలుగు వైభవంగా అమరావతిలో నిర్మించే ఎన్టీఆర్‌ స్మృతివనం ప్రాజెక్టును చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు...

CM Reviews NTR Memorial Project: తెలుగు వైభవంగాఎన్టీఆర్‌ స్మృతివనం

  • అమరావతిలో ఎన్టీఆర్‌ విగ్రహం, ఐకానిక్‌ వంతెనపై సీఎం సమీక్ష

అమరావతి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలుగువారి ఆత్మగౌవరం, ఆత్మవిశ్వాసం కలగలిపి తెలుగు వైభవంగా అమరావతిలో నిర్మించే ఎన్టీఆర్‌ స్మృతివనం ప్రాజెక్టును చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు, ఐకానిక్‌ వంతెన నిర్మాణంపై సీఎం క్యాంపు కార్యాలయంలో అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, భాష, సాహిత్యం, కళలు, ప్రాచీన చరిత్ర తదితర అంశాలకు పెద్దపీట వేస్తూ స్మృతివనం ప్రాజెక్టును చేపట్టాలని సూచించారు. అమరావతిలోని నీరుకొండ వద్ద చేపట్టనున్న ఈ ప్రాజెక్టులోని అంశాలను అధికారులు సీఎంకు వివరించారు. ప్రాచీన తెలుగు చరిత్రతో పాటు ప్రజల మనసుల్లో నిలిచిపోయిన అల్లూరి, పొట్టి శ్రీరాములు లాంటి విశిష్ఠ వ్యక్తుల విగ్రహాలు, మన భాష, లిపికి చెందిన వివరాలను కూడా తెలియజెప్పేలా ఆ ప్రాజెక్టులో ఏర్పాట్లు చేయాలని సూచించారు. తెలుగు ప్రజల ప్రతీకగా ఉండే ప్రజారాజధాని అమరావతిని కూడా ప్రతిబింబించేలా ఉండాలన్నారు. 182 మీటర్ల ఎత్తయిన ఎన్టీఆర్‌ విగ్రహ స్మృతివనం ప్రాజెక్టుకు అనుబంధంగా నీరుకొండ రిజర్వాయర్‌ను తీర్చిదిద్దాలన్నారు. గుజరాత్‌లో నిర్మించిన స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ ప్రాజెక్టును కూడా పరిశీలించాలని సీఎం పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పా రు. ఎన్టీఆర్‌ స్మృతివనంలో ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్‌ విగ్రహ నమూనాలను సీఎం పరిశీలించారు.

Updated Date - Sep 14 , 2025 | 03:54 AM