CM Paid Tribute to former Speaker Kodel Shivaprasad: కోడెల అంకితభావం స్ఫూర్తిదాయకం
ABN , Publish Date - Sep 17 , 2025 | 04:38 AM
మాజీ స్పీకర్, దివంగత కోడెల శివప్రసాద్... పల్నాడులో అణచివేతకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారు...
అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): మాజీ స్పీకర్, దివంగత కోడెల శివప్రసాద్... పల్నాడులో అణచివేతకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారు’ అని ఏపీ మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎంఏ షరీఫ్ పేర్కొన్నారు. కోడెల 6వ వర్ధంతిని సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో షరీ్ఫతోపాటు ఏపీ అగ్రికల్చరల్ మిషన్ వైస్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, హజ్ కమిటీ చైర్మన్ హసన్ భాషా తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ఎక్స్లో స్పందిస్తూ ‘ప్రజాసేవలో చిత్తశుద్ధి, పల్నాడు అభివృద్ధి పట్ల కోడెల అంకితభావం స్ఫూర్తిదాయకం’ అన్నారు.