CM Chandrababu Naidu: అరకు కాఫీకి అవార్డుపై సీఎం హర్షం
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:35 AM
ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ విభాగంలో చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ -2025 అవార్డును అరకు కాఫీ దక్కించుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు...
అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ విభాగంలో చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ -2025 అవార్డును అరకు కాఫీ దక్కించుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. అరకు కాఫీ తోటల సాగులో గిరజన రైతులు అవిశ్రాంతంగా.. అంకితభావంతో కృషి చేశారని ప్రశంసించారు. అరకు కాఫీ తోటల సాగులో గిరిజన రైతులు స్థిరమైన ఆదాయాలను పొందడంతోపాటు ప్రపంచ స్థాయి గుర్తింపునూ సాధించారని అన్నారు. అద్భుతమైన విజయాన్ని దక్కించుకున్న గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్కు అభినందనలు తెలిపారు.