Brandix Representatives: సీఎంను కలిసిన బ్రాండిక్స్ ప్రతినిధులు
ABN , Publish Date - Sep 12 , 2025 | 06:13 AM
బ్రాండిక్స్ అపెరల్ సంస్థ ప్రతినిధులు గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారు.
అనకాపల్లి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): ‘బ్రాండిక్స్’ అపెరల్ సంస్థ ప్రతినిధులు గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారు. అమెరికా టారి్ఫల వల్ల టెక్స్టైల్ రంగం ఎదుర్కోనున్న ఇబ్బందులను ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ఆయన స్పందిస్తూ.. ఈ విషయమై కేంద్ర ఆర్థిక మంత్రితో మాట్లాడి డొమెస్టిక్ మార్కెట్ అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తామని అన్నారు. సీఎంను కలిసిన వారిలో బ్రాండిక్స్ ఇండియా చైర్మన్ ఒమర్ అష్రాఫ్, మేనేజింగ్ డైరెక్టర్ అసిత్ ప్రేమ్రత్నె, డైరెక్టర్ ఒమర్ సాధిక్, డైరెక్టర్, భారతీయ భాగస్వామి పీసీ దొరైస్వామి ఉన్నారు.