Share News

Srisailam: కాళరాత్రి అలంకరణలో భ్రమరాంబికాదేవి

ABN , Publish Date - Sep 29 , 2025 | 03:21 AM

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో దసరా ఉత్సవాలు సందడిగా జరుగుతున్నాయి.

Srisailam: కాళరాత్రి అలంకరణలో భ్రమరాంబికాదేవి

శ్రీగిరిపై ఆది దంపతులకు గజ వాహనసేవ

శ్రీశైలం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో దసరా ఉత్సవాలు సందడిగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడోరోజు ఆదివారం భ్రమరాంబికా దేవి భక్తులకు కాళరాత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా రాత్రి మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా దేవి గజవాహనంపై విహరించారు. ఎనిమిదో రోజు సోమవారం నాడు అమ్మవారు మహాగౌరి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. రాత్రికి ఆది దంపతులు నందివాహనంపై విహరిస్తారు.

Updated Date - Sep 29 , 2025 | 03:22 AM