Srisailam: సిద్ధిదాయిని అలంకారంలో దర్శనమిచ్చిన భ్రమరాంబికాదేవి
ABN , Publish Date - Oct 01 , 2025 | 04:55 AM
శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాల్లో 9వ రోజు మంగళవారం భ్రమరాంబికాదేవి అమ్మవారు...
నేడు పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి ఆనం
శ్రీశైలం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాల్లో 9వ రోజు మంగళవారం భ్రమరాంబికాదేవి అమ్మవారు సిద్ధిదాయిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవారు కైలాస వాహనంపై విహరించారు. బుధవారం స్వామి అమ్మవారు రమావాణీ సేవిత రాజరాజేశ్వరిగా భక్తులకు దర్శనమిస్తారు. బుధవారం భ్రమరాంబికా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.