Share News

Excise Police: నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డి పీఏ అరెస్టు

ABN , Publish Date - Dec 10 , 2025 | 04:46 AM

అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో టీడీపీ నుంచి సస్పెండైన తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి పీఏ రాజేశ్‌(ఏ5)ను...

Excise Police: నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డి పీఏ అరెస్టు

ములకలచెరువు, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో టీడీపీ నుంచి సస్పెండైన తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి పీఏ రాజేశ్‌(ఏ5)ను ఎక్సైజ్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కేసులో ముందస్తు బెయిల్‌ కోసం విజయవాడ హైకోర్టు లాయర్‌ను కలసి ఓ బస్సులో వస్తు న్న రాజేశ్‌ను ఎక్సైజ్‌ పోలీసులు నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద పట్టుకున్నారు. అతడిని వెంట తీసుకెళ్లి ఈ కేసులో మరో నిందితుడైన జయచంద్రారెడ్డి ఇంట్లో పనిచేసే బాబు అలియాస్‌ అన్బురాసు(ఏ 19)ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. తంబళ్లపల్లె కోర్టులో రాజేశ్‌ను హాజరు పరిచారు. జడ్జి ఉమర్‌ ఫరూక్‌ 14 రోజులు రిమాండ్‌ విధించారు. దీంతో రాజేశ్‌ను మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు.

Updated Date - Dec 10 , 2025 | 04:47 AM