AP Library Council: గ్రంథాలయ పరిషత్కు సభ్యుల నియామకం
ABN , Publish Date - Jul 28 , 2025 | 05:52 AM
రాష్ట్ర గ్రంథాలయ పరిషత్కు నలుగురు సభ్యులను నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది.
అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గ్రంథాలయ పరిషత్కు నలుగురు సభ్యులను నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.సోమశేఖరరావు, విజయనగరానికి చెందిన రిటైర్డ్ సూపరింటెండెంట్ రౌతు రామమూర్తి, గుంటూరుకు చెందిన మగతాల పద్మజ, ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ వీఆర్ రాసని సభ్యులుగా నియమితులయ్యారు.