Share News

AP High Court: సిఫారసులతోనే రెండు జిల్లాల్లో ఎక్కువ బదిలీలు

ABN , Publish Date - Aug 19 , 2025 | 05:20 AM

ఉమ్మడి కృష్ణా, కర్నూలు జిల్లాల్లోని గ్రామ సచివాలయాల్లో పని చేసే విలేజ్‌ అగ్రికల్చల్‌ అసిస్టెంట్స్‌ను బదిలీ చేసిన విధానాన్ని హైకోర్టు తప్పుపట్టింది.

AP High Court: సిఫారసులతోనే రెండు జిల్లాల్లో ఎక్కువ బదిలీలు

  • ఉమ్మడి కృష్ణా, కర్నూలులో మళ్లీ కౌన్సెలింగ్‌ నిర్వహించండి

  • విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్స్‌ బదిలీలపై కలెక్టర్లకు హైకోర్టు ఆదేశం

  • ఇతర జిల్లాల విషయంలో జోక్యానికి నిరాకరణ

ఇంటర్నెట్ డెస్క్: ఉమ్మడి కృష్ణా, కర్నూలు జిల్లాల్లోని గ్రామ సచివాలయాల్లో పని చేసే విలేజ్‌ అగ్రికల్చల్‌ అసిస్టెంట్స్‌ను బదిలీ చేసిన విధానాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఈ రెండు జిల్లాల్లో ప్రజాప్రతినిధుల సిఫారసు ఆధారంగా ఎక్కువ బదిలీలు జరిగాయని చెప్పింది. కార్యనిర్వాహక ఆదేశాలు పక్కనపెట్టి సిఫారసుల ఆధారంగా బదిలీ చేయడమంటే సమాంతరపాలన భావన కలిగిస్తోందని తెలిపింది. నిబంధనల అమలులో అఽధికారులు విఫలమయ్యారని పేర్కొంది. ఆ రెండు జిల్లాల్లో మళ్లీ కౌన్సెలింగ్‌ నిర్వహించి బదిలీ ప్రక్రియను అమలు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ఇతర జిల్లాల్లో సిఫారసులు పెద్దగా లేనందున జోక్యం చేసుకోబోమంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.విజయ్‌ ఇటీవల కీలక తీర్పు ఇచ్చారు.

Updated Date - Aug 19 , 2025 | 05:21 AM