Director of Information Department: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు పెంపు
ABN , Publish Date - Aug 30 , 2025 | 05:54 AM
ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో వాటి కాలపరిమితిని మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు సమాచార శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు.
అమరావతి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో వాటి కాలపరిమితిని మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు సమాచార శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆగస్టు 31 వరకు అక్రిడిటేషన్ కార్డులు కలిగి ఉన్న పాత్రికేయులకు మాత్రమే మరో మూడు నెలలు... సెప్టెంబరు 1 నుంచి నవంబరు 30 వరకూ లేదా నూతన అక్రిడిటేషన్ కార్డుల జారీ చేసే ప్రక్రియ... ఏది ముందు జరిగితే అప్పటివరకూ ఈ పొడిగింపు ఉత్తర్వులు అమలులో ఉంటాయని హిమాన్షు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.