Pension Appeals: దివ్యాంగ పెన్షన్లకు మరో అవకాశం
ABN , Publish Date - Aug 20 , 2025 | 06:20 AM
దివ్యాంగ పెన్షన్కు అప్పీలు చేసుకునేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది.
త్వరలో మళ్లీ ఆస్పత్రుల్లో సదరం స్లాట్స్
అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): దివ్యాంగ పెన్షన్కు అప్పీలు చేసుకునేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. తాము పెన్షన్కు అర్హులమని భావించే దివ్యాంగులు వెంటనే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. పెన్షన్కు అనర్హులుగా నోటీసు అందుకున్న వారు, తాము అర్హులమని భావిస్తే వెంటనే సమీప ఎంపీడీవో లేదా మునిసిపల్ కమిషనర్లకు అర్జీలు సమర్పించాలని సూచించారు.