సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఆంధ్ర: సీఎస్
ABN , Publish Date - Aug 30 , 2025 | 05:39 AM
వచ్చే ఏడా ది జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటికి రాష్ట్రాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని...
అమరావతి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడా ది జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటికి రాష్ట్రాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్నారు. అమరావతి సచివాలయంలోని మూడో బ్లాకులో శుక్రవారం ఆయన ఆర్వోప్లాం ట్, గ్లాస్ బాటిలింగ్ యూనిట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా ఇప్పటికే సచివాలయం లో ఉద్యోగులందరికీ స్టెయిన్లె్స స్టీల్ బాటిళ్లు ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు.