Share News

CEO of NITI Aayog: వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ టాప్‌

ABN , Publish Date - Oct 24 , 2025 | 05:05 AM

తూర్పు తీరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ ముందుందని నీతిఅయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్ర హ్మణ్యం అన్నారు.

CEO of NITI Aayog: వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ టాప్‌

  • సీఎస్‌తో భేటీలో నీతి ఆయోగ్‌ సీఈవో సుబ్రహ్మణ్యం

అమరావతి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): తూర్పు తీరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ ముందుందని నీతిఅయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్ర హ్మణ్యం అన్నారు. పూర్వోదయ పథకం, విశాఖపట్నం గ్రోత్‌ హబ్‌ పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌తో ఆయన గురువారం అమరావతి సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భ ంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పూర్వోదయ పథకం ద్వారా తీరప్రాంతంలో మరింత అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఏపీలో పలు ఓడరేవులు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఒక కంటైనర్‌ మెగా పోర్టు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉం దని, ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని సూచించారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి గ్రోత్‌ కారిడార్ల ఏర్పాటు, వాటిద్వారా జరిగే అభివృద్ధి ప్రయోజనాలపై చర్చించారు. అనంతరం సీఎస్‌ మాట్లాడుతూ.. విశాఖపట్నం గ్రోత్‌ హబ్‌ పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా ఒక అధికారిని ఇన్‌చార్జిగా నియమిస్తామని చెప్పారు.

Updated Date - Oct 24 , 2025 | 05:07 AM