Share News

Legislature Committees: ఉభయ సభల మౌలిక సదుపాయాల కమిటీ చైర్మన్‌గా స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

ABN , Publish Date - Jul 26 , 2025 | 11:34 PM

రాష్ట్ర శాసనమండలికి, ఉభయసభలకు సంయుక్త కమిటీలను నియమించారు. శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, మండలి చైర్మన్‌ కొయ్యే మోషన్‌ రాజ్‌ సంయుక్త కమిటీలను, మండలి చైర్మన్‌ శాసనమండలి కమిటీలను నియమించారు.

 Legislature Committees: ఉభయ సభల మౌలిక సదుపాయాల కమిటీ చైర్మన్‌గా స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

  • సభానియమాల కమిటీ చైర్మన్‌గా మోషేన్‌

  • అర్జీల కమిటీ చైర్మన్‌గా జకియా ఖానమ్‌

  • నైతిక విలువ కమిటీ చైర్మన్‌గా భూమిరెడ్డి

  • మండలి, ఉభయసభలకు కమిటీల నియామకం

అమరావతి, జూలై 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనమండలికి, ఉభయసభలకు సంయుక్త కమిటీలను నియమించారు. శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, మండలి చైర్మన్‌ కొయ్యే మోషన్‌ రాజ్‌ సంయుక్త కమిటీలను, మండలి చైర్మన్‌ శాసనమండలి కమిటీలను నియమించారు. 2025-26 సంవత్సరానికి సంబంధించిన వ్యవహారాలను ఈ కమిటీలు పర్యవేక్షించనున్నాయి.

శాసనమండలి కమిటీలు

  • సభానియమాల కమిటీ చైర్మన్‌గా మండలి చైర్మన్‌ మోషేను రాజు ఉంటారు. సభ్యులుగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, చిన్న గోవిందరెడ్డి దేవసాని, బి. తిరుమలనాయుడు, మురుగుడు హనుమంతరావు, యల్లారెడ్డిగారి శివరామిరెడ్డి, బీద రవిచంద్రను నియమించారు.

  • తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా మండలి చైర్మన్‌ మోషేను రాజు, సభ్యులుగా చంద్రగిరి ఏసురత్నం, టి. కల్పలత, తూమాటి మాధవరావు, భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి, ఎస్‌. మంగమ్మ, సోము వీర్రాజును నియమించారు.

  • అర్జీల కమిటీ చైర్మన్‌గా మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ జకియా ఖానమ్‌, సభ్యులుగా.. ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, గాదె శ్రీనివాసులనాయుడు, తూమాటి మాధవరావు, పండుల రవీంద్రబాబు, మేరిగ మురళీధర్‌ నియమితులయ్యారు.

  • సభాసమయంలో సమర్పించే పత్రాల కమిటీ చైర్మన్‌గా పండుల రవీంద్రబాబు, సభ్యులుగా.. కుడిపూడి సూర్యనారాయణరావు, పాలవలస విక్రాంత్‌, పేరాబత్తుల రాజశేఖర్‌ నియమితులయ్యారు.

  • నైతిక విలువ కమిటీ చైర్మన్‌గా భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి, సభ్యులుగా.. చిన్న గోవిందరెడ్డి దేవసాని, బొర్రా గోపి మూర్తి, మురుగుడు హనుమంతరావు, యల్లారెడ్డిగారి శివరామిరెడ్డిని నియమించారు.

  • విశేషాధికారాల కమిటీ చైర్మన్‌గా బి. తిరుమలనాయుడు, సభ్యులుగా కేఆర్‌జే భరత్‌, పి. చంద్రశేఖర్‌రెడ్డి, పండుల రవీంద్రబాబు, తలశిల రఘురాం, ఆర్‌. రమేశ్‌ యాదవ్‌ నియమితులయ్యారు.

  • ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా ఇసాక్‌ భాష, సభ్యులుగా ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, కవురు శ్రీనివాస్‌, ఎంవీ రామచంద్రారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి నియమితులయ్యారు.


సంయుక్త కమిటీలు..

  • ఉభయ సభల మౌలిక సదుపాయాల కమిటీ చైర్మన్‌గా స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, సభ్యులుగా ఎన్‌. అమరనాథ్‌ రెడ్డి, గుమ్మనూరు జయరాం, నిమ్మకాయల చినరాజప్ప, పంచకర్ల రమేశ్‌బాబు, పంతం వెంకటేశ్వరరావు, యరపతినేని శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, దేవసాని చిన్న గోవిందరెడ్డి, వంకా రవీంద్రనాథ్‌ నియమితులయ్యారు.

  • వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్‌గా స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు నియమితులయ్యారు. సభ్యులుగా.. ఆరణి శ్రీనివాసులు, కురుగొండ్ల రామకృష్ణ, గొండు శంకరరావు, చింతమనేని ప్రభాకర్‌, నందమూరి బాలకృష్ణ, పులివర్తి వెంకట మణి ప్రసాద్‌, బుడ్దా రాజశేఖర్‌ రెడ్డి, వి.నరేంద్రవర్మ, దేవసాని చిన్న గోవిందరెడ్డి, బి. తిరుమల నాయుడు, పాలవలస విక్రాంత్‌ నియమితులయ్యారు.

  • షెడ్యూల్‌ కులాల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా వర్ల కుమార్‌ రాజా, సభ్యులుగా కొండ్రు మురళీ మోహన్‌, కొలికపూడి శ్రీనివాసరావు, తాటిపర్తి చంద్రశేఖర్‌, దేవ వరప్రసాద్‌, బోనెల విజయచంద్ర, ఎంఎస్‌ రాజు, సొంగా రోషన్‌ కుమార్‌, బీఎన్‌ విజయకుమార్‌, కావలి గ్రీష్మ ప్రసాద్‌, బొమ్మి ఇజ్రాయెల్‌, మేరిగ మురళీధర్‌ నియమితులయ్యారు,గిరిజన సంక్షేమ కమిటీ చైర్మన్‌గా మిరియాల శిరీషాదేవి, సభ్యులుగా కోనేటి ఆదిమూలం, చిర్రి బాలరాజు, నిమ్మక జయకృష్ణ, జి. జయసూర్య, బడేటి రాధాకృష్ణయ్య, మత్సరాస విశ్వేశ్వర రాజు, కె. మురళీమోహన్‌, రేగం మత్సలింగం, అనంతబాబు, కుంభా రవిబాబు, పేరాబత్తుల రాజశేఖర్‌ నియమితులయ్యారు.

  • అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా మహ్మద్‌ నజీర్‌ అహ్మద్‌ నియమితులయ్యారు. సభ్యులుగా దగ్గుపాటి ప్రసాద్‌, ప్రత్తిపాటి పుల్లారావు, బొజ్జల సుధీర్‌ రెడ్డి, బోడె ప్రసాద్‌, సీహెచ్‌ వంశీ కృష్ణ శ్రీనివాస్‌, బి. విరూపాక్షి, షాజహాన్‌ భాషా, సుందరపు విజయకుమార్‌, ఇసాక్‌ భాషా, మహ్మద్‌ రుహుల్లా, సి. రామచంద్రయ్య నియమితులయ్యారు.

  • మహిళా, శివు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా గౌరు చరితారెడ్డి, సభ్యులుగా గల్లా మాధవి, దాసరి సుధ, నెలవల విజయశ్రీ, పరిటాల సునీత, పల్లె సింధూరరెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, లోకం నాగమాధవి, వరుపుల సత్యప్రభ, టి. కల్పలత, కావలి గ్రీష్మ ప్రసాద్‌, ఎ. మధుసూదన్‌ నియమితులయ్యారు.

  • అనుగత చట్ట నిర్మాణ కమిటీ చైర్మన్‌గా తోట త్రిమూర్తులు, సభ్యులుగా ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, గాలి భానుప్రకాశ్‌, దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి, పుట్టా సుధాకర్‌ యాదవ్‌, బండారు శ్రావణి శ్రీ, మండలి బుద్ధ ప్రసాద్‌, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి, భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి నియమితులయ్యారు.

  • వెనుకబడిన వర్గాల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా బీద రవిచంద్ర, సభ్యులుగా.. చదలవాడ అరవిందబాబు, ఆదిరెడ్డి శ్రీనివాస్‌, కందికుంట వెంకట ప్రసాద్‌, కాగిత కృష్ణప్రసాద్‌, కొణతాల రామకృష్ణ, బగ్గు రమణమూర్తి, ఎం. మాలకొండయ్య, వనమాడి వెంకటేశ్వరరావు, కేఈ శ్యాం బాబు, నర్తు రామారావు, సిపాయి సుబ్రమణ్యం నియమితులయ్యారు.

  • గ్రంథాలయ కమిటీ చైర్మన్‌గా పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, సభ్యులుగా జేసీ అస్మిత్‌రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, కాకర్ల సురేశ్‌, పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి, వెనిగండ్ల రాము, కేఈ శ్యాంబాబు, సుందరపు విజయ్‌ కుమార్‌, వంకా రవీంద్రనాథ్‌, సోము వీర్రాజు నియమితులయ్యారు.

Updated Date - Jul 26 , 2025 | 11:34 PM