Share News

AP Govt: రబీ పంటల బీమాకు 44 కోట్లు విడుదల

ABN , Publish Date - Nov 11 , 2025 | 06:08 AM

ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం కింద ఈ ఏడాది రబీ సీజన్‌లో పంటల బీమాను సకాలంలో అమలుచేయడానికి ప్రభుత్వం....

AP Govt: రబీ పంటల బీమాకు 44 కోట్లు విడుదల

అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం కింద ఈ ఏడాది రబీ సీజన్‌లో పంటల బీమాను సకాలంలో అమలుచేయడానికి ప్రభుత్వం రూ.44.06 కోట్ల విడుదలకు అనుమతించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఎస్ర్కో ఖాతాలో జమ చేయాల్సిన ముందస్తు ప్రీమియం సబ్సిడీలో 50 శాతానికి ఈ మొత్తం సమానమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, విజయవాడలో మార్కెటింగ్‌ శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరుగా పనిచేస్తున్న వై.శ్రీనివాసరావుకు తాత్కాలిక పదోన్నతి కల్పించి, సెంట్రల్‌ మార్కెట్‌ ఫండ్‌ సర్వీస్‌ కింద ఉన్న గుంటూరు మార్కెటింగ్‌ శాఖ డైరెక్టరేట్‌లో సూపరింటెండెంట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీఅయ్యాయి.

Updated Date - Nov 11 , 2025 | 06:08 AM