Share News

Andhra Pradesh Government: బీసీలకు వెన్నుదన్నుగా ఆదరణ 3.0

ABN , Publish Date - Nov 04 , 2025 | 05:21 AM

ఆదరణ 3.0 బీసీలకు వెన్నుదన్నుగా నిలవనుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.సవిత అన్నారు.

Andhra Pradesh Government: బీసీలకు వెన్నుదన్నుగా ఆదరణ 3.0

అమరావతి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఆదరణ 3.0 బీసీలకు వెన్నుదన్నుగా నిలవనుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.సవిత అన్నారు. సోమవారం గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్‌లో బీసీ కార్పొరేషన్‌ చైర్మన్లు, కుల సంఘాల డైరెక్టర్లతో ఆదరణ 3.0 పథకం అమలుపై మూడు రోజుల వర్క్‌షాపును మంత్రి ప్రారంభించారు. ఆదరణ 3.0 పథకానికి రూ.1000 కోట్ల బడ్జెట్‌లో కేటాయించామన్నారు. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా.. ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు బడ్జెట్‌లో అత్యధికంగా నిధులు కేటాయించారన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాల్లో ఎక్కువగా లబ్ధి పొందింది బీసీలేనని, మెగా డీఎస్సీలో బీసీ వర్గాలకు చెందిన వారే ఎక్కువగా ఎంపికయ్యారని మంత్రి గుర్తు చేశారు.

Updated Date - Nov 04 , 2025 | 05:21 AM