Share News

ఎన్నికల హమీలకు వెన్నుపోటు

ABN , Publish Date - Jun 04 , 2025 | 11:30 PM

కూటమి ప్రభుత్వం ఎన్నికల హమీలకు వెన్నుపోటు పొడించిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహనరెడ్డి అన్నారు.

ఎన్నికల హమీలకు వెన్నుపోటు
అధికారికి వినతి పత్రం అందజేస్తున్న వైసీపీ నాయకులు

వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహనరెడ్డి

కర్నూలులో వైసీపీ శ్రేణుల నిరసన

కర్నూలు న్యూసిటీ, జూన 4(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఎన్నికల హమీలకు వెన్నుపోటు పొడించిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహనరెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా వైసీపీ నాయకులు జిల్లా వ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’ నిర్వహించారు. కర్నూలు నగరంలో ఆ పార్టీ నాయకులు గౌరీ గోపాల్‌ ఆసుపత్రి నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాదిమంది వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కలెక్టరేట్‌ వద్ద జరిగిన నిరసనలో నాయకులు కూటమి ప్రభుత్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ఎస్వీ మోహనరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హమీలు సూపర్‌ సిక్స్‌ మెనిఫెస్టోను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని ప్రతి వర్గం ఈ ప్రభుత్వ పాలన వల్ల తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రజల హక్కులు, గౌరవ, భవిష్యుత్తును కాపాడేందుకు వైసీపీ తరపున కార్యకర్తలు, అభిమానులతో పాటు అందరు కలిసి వస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన, కేడీసీసీ మాజీ చైర్‌పర్సన ఎస్వీ విజయమనోహరి, గ్రంథాలయ మాజీ చైర్మన సుభాష్‌చంద్రబోసు, నాయకులు అహ్మద్‌ అలీఖాన, తిరుమలేశ్వరరెడ్డి, మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 11:30 PM