Jupalli: ప్రజలు మెచ్చేలా ఉద్యోగులు పని చేయాలి: కృష్ణారావు
ABN , Publish Date - Jan 17 , 2024 | 09:28 PM
ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు మెచ్చేలా పని చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupalli Krishnarao) సూచించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో IDOC కార్యాలయంలో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు.
వనపర్తి: ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు మెచ్చేలా పని చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupalli Krishnarao) సూచించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో IDOC కార్యాలయంలో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "గత బీఆర్ఎస్ సర్కార్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపించేలా ప్రజలు మెచ్చుకునే విధంగా పనులు సాగాలి. ప్రభుత్వాదాయానికి గండిపడకుండా, ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా అధికారులు బాధ్యత వహించాలి. అలాంటివి గతంలో జరిగుంటే వాటిని రికవరి చేస్తాం. అభివృద్ధిపై జరిగే సమావేశాల్లో ఇచ్చే రిపోర్టులకు వాస్తవాలకు చాలా తేడా ఉంటోంది. తప్పుడు నివేదికలు ఇచ్చే అధికారులపై చర్యలు తప్పవు" అని మంత్రి అన్నారు.