యాంకర్ అనసూయ ఆవిష్కరించిన కస్తూరి సిల్వర్ జ్యూవెలరీ స్టోర్‌

ABN , First Publish Date - 2023-04-21T23:15:38+05:30 IST

యాంకర్ అనసూయ ఆవిష్కరించిన కస్తూరి సిల్వర్ జ్యూవెలరీ స్టోర్‌

యాంకర్ అనసూయ ఆవిష్కరించిన కస్తూరి సిల్వర్ జ్యూవెలరీ స్టోర్‌

హైదరాబాద్: యాంకర్, సినీ నటీ అనసూయ ఏఎస్ రావు నగర్‌లో సందడి చేసింది. తెలుగు రాష్ట్రాలలో హీరోయిన్లని మించిన క్రేజ్‌ని సొంతం చేసుకున్న అనసూయ.. ఏఎస్ రావ్ నగర్‌లో కస్తూరి సిల్వర్ జ్యూవెలరీ షాపును ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ఆమెను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఈ ప్రారంభోత్సవం అనంతరం కస్తూరి సిల్వర్ జ్యూవెలరీ ప్రత్యేకతలు ఆమె అడిగి తెలుసుకుంది. కస్తూరి బ్రదర్స్ మరియు పార్ట్‌నర్స్ సంయుక్తంగా 1993లో వస్త్ర వ్యాపారం ప్రారంభించారు. కస్టమర్ల ఆధారాభిమానాలతో 30 సంవత్సరాల నుంచి దినదినం ఈ వ్యాపారం అభివృద్ది చెందుతూ వస్తోంది. ఇలా ప్రయాణం కొనసాగిస్తూ 26 జనవరి 2023 నాడు చందానగర్‌లో కస్తూరి సిల్వర్ జ్యువెలరీ స్టోర్‌ను ప్రారంభించి.. అనతి కాలంలోనే ఏఎస్ రావు నగర్‌లో రెండవ షో రూంను అనసూయ భరద్వాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు. వీరు ప్రత్యేకమైన డిజన్లతో తయారు చేసిన అనేక వెండి అభరణాలను తయారు చేసి అమ్మకం చేస్తారు.

కస్తూరి సిల్వర్ జ్యూవెలరీ ప్రత్యేకత ఏంటంటే సిల్వర్ కలెక్షన్స్‌లో ప్యూర్ గోల్డ్‌లో ఏ వెరైటీస్ అయితే వస్తాయో అదే వెరైటీలు, అంతే ప్రత్యేకమైన అభరాణాలు వీరు తయారు చేస్తారు. ముఖ్యంగా డైమెండ్ కలెక్షన్లు, సీఏజెడ్ కలెక్షన్లు, విక్టోరియన్ కలెక్షన్లు, నక్షి కలెక్షన్స్, వింగ్స్, పాపడబిల్లలు, నెక్లెస్‌లు, చౌకార్లు, వడ్డాణాలు, గాజులు వీరి ప్రత్యేకం. ముఖ్యంగా ఈ స్టోర్ ప్రత్యేకత ఏంటంటే మార్కెట్లో ఉండే అన్ని డిజైన్లు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉండటం. కస్తూరి జ్యూవెలరీలో ప్రత్యేకంగా తయారు చేసి, కస్టమర్లకు అందుబాటులో ఉండే ధరలోనే అమ్మడానికి ఏస్ రావ్ నగర్‌లో ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2023-04-21T23:15:38+05:30 IST