NRI: భార్యపై 15 సార్లు కాల్పులు జరిపి హత్య చేసిన భర్త.. డైవర్స్ నోటీసు పంపిందని దారుణం

ABN , First Publish Date - 2023-09-29T22:07:10+05:30 IST

మిషిగన్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గ్రాండ్ రాపిడ్స్ నగరానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యపై 15 సార్లు కాల్పులు జరిపి చంపేశాడు. ఆమె డైవర్స్ నోటీసులు పంపిన మరుసటి రోజు ఈ దారుణానికి ఒడిగట్టాడు.

NRI: భార్యపై 15 సార్లు కాల్పులు జరిపి హత్య చేసిన భర్త.. డైవర్స్ నోటీసు పంపిందని దారుణం

ఎన్నారై డెస్క్: మిషిగన్(Michigan) రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గ్రాండ్ రాపిడ్స్ నగరానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యపై 15 సార్లు కాల్పులు జరిపి చంపేశాడు. ఆమె డైవర్స్ నోటీసులు పంపిన మరుసటి రోజు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇటీవల అతడిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు మార్కస్ లాఫ్టన్‌కు ఫిబ్రవరిలో వివాహం జరిగింది. అయితే, ఈ ఏడాది ఆగస్టు 16న భార్య అలీషియా లాఫ్టన్ డైవర్స్ నోటీసులు పంపించింది. అంతేకాకుండా, తాము ఉంటున్న ఇంటిని కూడా అమ్మేస్తున్నట్టు భర్తకు చెప్పింది. అయితే, ఓ రోజు భార్య రియల్ ఎస్టే్ట్ ఏజెంట్‌తో సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకుంటోందని మార్కస్ భావించాడు. ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బు మొత్తం తనే అట్టేపెట్టుకోవాలని ఆమె భావిస్తున్నట్టు అనుమానించాడు. ఈ క్రమంలో ఆగస్టు 17న వారి మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మార్కస్ సొరుగులోని గన్ను తీసి దానితో ఆమెను కొట్టాడు.


దీంతో, భయపడిపోయిన అలీషియా మరో గదిలోకి పారిపోయి తలుపేసుకుంది. ఆ తరువాత ఆమె గది కిటికీలోంచి దూకి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా మార్కస్ తలుపులు పగలగొట్టుకుని లోపలికొచ్చాడు. ఆమెపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది(Husband kills wife a day after being served divorce notice). కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రిక తరలించారు. పరారీలో ఉన్న నిందితుడిని అదే రోజు వెతికి పట్టుకున్నారు. తాజాగా అతడిపై హత్యయాత్నం కింద కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-09-29T22:11:34+05:30 IST