munugode by election results: కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది: సీఈఓ వికాస్ రాజ్

ABN , First Publish Date - 2022-11-06T20:50:30+05:30 IST

మునుగోడు ఉపఎన్నిక మొత్తం కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. ప్రొసీజర్ ప్రకారం అధికారికంగా RO ఫలితాలు విడుదల చేస్తారని వికాస్ రాజ్ చెప్పారు.

munugode by election results: కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది: సీఈఓ వికాస్ రాజ్

హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక మొత్తం కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. ప్రొసీజర్ ప్రకారం అధికారికంగా RO ఫలితాలు విడుదల చేస్తారని వికాస్ రాజ్ చెప్పారు. ర్యాండంగా 5 EVM లా VV ఫ్యాట్లను లెక్కించి సరిచూసుకుంటారని, ఎక్కడ పక్షపాతం లేకుండా ఎన్నికల ప్రక్రియను నిర్వహించామని, ఆరోపణలు ఎన్ని వచ్చిన ప్రొసీజర్ ప్రకారమే చేశామని పేర్కొన్నారు. వ్యక్తిగత తప్పిదం చేసినందునే ఆర్వోపై వేటు పడిందని, దేశం మొత్తం ఫోకస్ ఉన్న మునుగోడు ఉపఎన్నిక ముగించామని సీఈఓ తెలిపారు. సిబ్బందికి, సహకరించిన వారికి అభినందలు చెప్పారు. ఎలక్షన్ కోడ్ నవంబర్ 8న ముగుస్తుందని సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు.

Updated Date - 2022-11-06T20:51:49+05:30 IST