AP News: పాస్టర్ పాడుబుద్ధి.. ఆరోగ్య బాగోలేక చర్చికి తీసుకొస్తే..
ABN , First Publish Date - 2022-12-06T17:34:23+05:30 IST
Krishna: దేవుడి సేవలో తరిస్తున్న పాస్టర్కు దుర్భద్ధి పుట్టింది. ఆరోగ్యం బాగోలేకపోవడంతో చర్చికి తీసుకువెళ్లిన బాలికను లోబరుచుకున్న ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. నాగేశ్వరావు నూజివీడు చర్చి
Krishna: దేవుడి సేవలో తరిస్తున్న పాస్టర్కు దుర్భద్ధి పుట్టింది. ఆరోగ్యం బాగోలేకపోవడంతో చర్చికి తీసుకువెళ్లిన బాలికను లోబరుచుకున్న ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. నాగేశ్వరావు నూజివీడు చర్చి పాస్టర్గా వ్యవహరిస్తున్నాడు. ఈయన భార్య కొంతకాలం క్రితం చనిపోయింది. సుమారు 20 ఏళ్ల వయసు ఉన్నపిల్లలున్నారు. పాస్టర్ అఘాయిత్యాన్నిబాలిక ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు.. ఆమెను బంధువులు ఇంటిని పంపారు. ఈ క్రమంలో పాస్టర్ బాలిక ఆచూకీ కోసం రెండు నెలలు గాలించాడు. చివరకు గన్నవరం మండలం ముస్తాబాద్లోని తన పిన్ని ఇంట్లో ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో బాలికను తన వెంట హైదరాబాదుకు తీసుకెళ్లాడు. బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు గాలింపు చేపట్టి బాలికను, పాస్టర్ను అదుపులోకి గన్నవరం పోలీసులకు అప్పగించారు. వారు పాస్టర్ను అదుపులోకి తీసుకుని బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చారు.