Home » Pressmeet
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా 4వ విడత పోలింగ్ జాతర కొనసాగుతోంది. కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై సీఈవో వికాష్ రాజ్కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మోదీ పేరును ప్రస్తావించడంపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది.
అమరావతి: ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు జరుగుతున్న పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబం ( చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి) మంగళగిరి నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
నెల్లూరు: నగరంలోని మాగుంట లేఔట్ ఎస్ఆర్కె స్కూల్లో కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రకభాకర్ రెడ్ది దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని, భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నామని అన్నారు.
బీజేపీ ఒక రకమైన క్యాన్సర్లాంటిదని, ఆ పార్టీ తెలంగాణ సమాజానికి ప్రమాదకరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ వేలూనుకుంటే శాంతిని, భద్రతను మర్చిపోవాల్సిందేనన్నారు. బీజేపీ అడుగు పెడితే సమాజం నిట్టనిలువునా చీలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా, రాష్ట్రానికి పెట్టుబడులు, ఆదాయమూ రావని ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్: 45 సంవత్సరాల సుదీర్ఘ సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డ్ ఇచ్చిందని, తన కృషి , సేవతో పాటు తన అభిమానులు, ప్రేక్షకులు, దర్శక నిర్మాతలు టెక్నిషియన్స్కు మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు.
విశాఖ: తూర్పు నియోజకవర్గం ప్రజలకు తాను ఎంతో చేశానని కూటమి అభ్యర్థి, టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు. తాను చేయగలిగినంత సహాయం చేస్తానని.. మాటలతో మోసం చేయడం తెలియదని అన్నారు. గతంలో ఎలా ఉన్నా.. రేపు కూడా అలానే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పొత్తుపెట్టుని.. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో ఏ పొత్తు లేదన్నట్టుగా సభల్లో ఆయనను దూషిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
విజయవాడ: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ, పశ్చిమ నియోజకవర్గం సీపీఐ అభ్యర్ధి కోటీశ్వరరావుకు మద్దతుగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం కోసం బీజేపీ ఎలాంటి పనికైనా బరితెగిస్తుందని ఆరోపించారు.
హనుమకొండ : ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఆదివారం భీమదేవరపల్లి మండలం, ముల్కనూర్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలేనని అన్నారు.
విజయవాడ: కూటమి బీజేపీ ఎంపీ అభ్యర్థి సుజనా చౌదరి జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక దుర్మార్గపు చట్టంగా అభివర్ణించారు.