Home » Pattabhi ram
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా గురువారం అమరాతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులు కొట్టేయడానికి జగన్ పన్నాగం పన్నారని, ఆయన పాదయాత్ర పేరుతో ‘నాడు మార్నింగ్, ఈవినింగ్ వాక్’ చేశారని, ఆ సమయంలో ఎక్కడెక్కడ ఆస్తులు, స్థలాలు ఉన్నాయో వాటిపైనే జగన్ చూపు ఉండేదని ఆరోపించారు.
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రిలో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. భద్రాచల పుణ్యక్షేత్రంలో బుధవారం శ్రీసీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. గురువారం శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ దంపతులు హాజరుకానున్నారు.
విజయవాడ: సీఎం జగన్ కోడి కత్తి కేసు ఏ విధంగా అంకురార్పణ చేశారో అదేవిధంగా గులక రాయి దాడి డ్రామా చేశారని, బీసీ వర్గానికి చెందిన పదిమంది యువకుల్ని గులకరాయు కేసులో బలి చేశారని తెలుగుదేశం జాతీయ కార్యదర్శి పట్టాభిరామ్ అన్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి కుట్రలో భాగమేనని తెలుగుదేశం జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. సీఎంపై జరిగిన రాళ్ల దాడిపై స్పందించిన ఆయన ఆదివారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ...
Andhrapradesh: సిట్ కార్యాలయంలో దగ్ధం చేసింది హెరిటేజ్ డాక్యుమెంట్లు కాదని.. వేస్ట్ పేపర్స్ను దగ్ధం చేశామంటూ సిట్ అధికారులు ఇచ్చిన వివరణపై టీడీపీ నేత పట్టాభి మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సీట్ అధికారులు ఇచ్చిన వివరణకు ఎటువంటి పొంతన లేదన్నారు. వారు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు 100 తప్పులు చేస్తున్నారని విమర్శించారు. కచ్చితంగా దీనికి సిట్ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
Andhrapradesh: తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయ కాంపౌండ్లో హెరిటెజ్కు సంబంధింన కీలక డాక్యుమెంట్ల దగ్ధంపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో టీడీపీ నేతలు మాట్లాడుతూ... ఎవరి ఆదేశాలతో డాక్యుమెంట్లు తగలబెట్టారనేది వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
తాడేపల్లి ప్యాలెస్కు కొందరు అధికారులు ఊడిగం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్( Kommareddy Pattabhiram) అన్నారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కొందరు ఐఏఎస్ అధికారులు జేపీఎస్(జగన్ పర్సనల్ సర్వీస్) అధికారులుగా మారారని మండిపడ్డారు.
Andhrapradesh: విజయవాడలో కరకట్ట ఆనుకుని నిర్మించిన రిటైనింగ్ వాల్పై అసలు వాస్తవాలను తెలుగుదేశం పార్టీ బయటపెట్టింది. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి సమాచార చట్టం ద్వారా ఇచ్చిన జవాబు ఆధారాలు టీడీపీ ప్రజల ముందుకు తీసుకొచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి చేపట్టిన చర్యలు, మొదటిదశ నిర్మాణం పూర్తి, ఖర్చు చేసిన రూ.164.42కోట్ల వివరాలపై వీడియోను విడుదల చేసింది.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. పలువురు ముఖ్య నేతలతో పాటు యువత కూడా టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతోంది. ఇందులో భాగంగా నగరంలోని భవానీపురం, విద్యాదరాపురం, గుణదల ప్రాంతాల నుంచి భారీగా యువత పార్టీలో చేరారు. టీడీపీ నేత కేశినేని చిన్ని సమక్షంలో యువత పార్టీ కండువా కప్పుకుంటున్నారు.
Andhrapradesh: రాష్ట్రంలో పెన్షన్లు ఇచ్చేందుకు పది రోజులు పడుతుందంటూ సర్కార్ చెప్పడంపై టీడీపీ నేత పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటిలాగానే జగన్మోహన రెడ్డి తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇతరుల మీద బురదజల్లుతున్నారని మండిపడ్డారు. సోమవారం పట్టాభి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ కన్నా ముందే హైకోర్టు ఆదేశాల ప్రకారం ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో వాలంటీర్లను దూరంగా ఉంచాలనే ఆదేశాలు వచ్చాయని గుర్తుచేశారు. హైకోర్టు, ఎలక్షన్ కమిషన్లు ఎక్కడా డోర్ టూ డోర్ పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేయొద్దని చెప్పలేదన్నారు.