Home » Nara Lokesh
మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పోలింగ్ జరగనుంది. అభ్యర్థులు, పార్టీ నేతలు బిజీగా ఉండగా, మరికొందరు బెట్టింగుల్లో మునిగి తేలుతున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తోంది..? మెజార్టీ ఎంత ఉండనుంది..? మ్యాజిక్ ఫిగర్..? ప్రముఖుల బరిలో నిలిచిన చోట ఎవరు విజయం సాధిస్తారనే అంశాలపై రూ.కోట్లలో బెట్టింగ్ జరుగుతోంది.
Andhrapradesh: మంగళగిరి ప్రజలకు టీడీపీ నేత నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. ‘‘పేదరికం లేని మంగళగిరి నా కల’’ అంటూ యువనేత అందులో పేర్కొన్నారు. శతాబ్ధాల చరిత్ర కలిగిన మంగళగిరి రాజకీయ చైతన్యానికి పుట్టినిల్లన్నారు. కృష్ణమ్మ పరవళ్లు, ప్రకృతిసోయగాల నడుమ నిత్యనూతనంగా విరాజిల్లే సుందరమైన ప్రాంతం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గమన్నారు.
తిరుపతి కేంద్రంగా 50,000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. తిరుపతిలో కూటమి రోడ్ షోలో నారా లోకేష్ మాట్లాడుతూ.. రాయలసీమ బిడ్డనని చెప్పి ముద్దులు పెడుతూ వచ్చిన జగన్.. రాయలసీమకు పట్టిన క్యాన్సర్ లాగా తయారయ్యాడని విమర్శించారు. రాయలసీమలో ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు.
Andhrapradesh: కూటమి అభ్యర్థికి మద్దతుగా రోడ్ షోలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తిరుపతికి చేరుకున్నారు. తిరుపతిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొనేందుకు జేపీ నడ్డా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పటికే జ్యోతిరావు పూలే విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం జేపీ నడ్డాతో కలిసి లోకేష్ రోడ్ షో నిర్వహించారు. జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారం కోసం ప్రత్యేక విమానంలో లోకేష్ తిరుపతికి వచ్చారు.
బళ్లారి శ్రీ అమృతేశ్వర ఆలయానికి విచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు.., నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులకు సందర్భోచితంగా భక్తి స్వాగతం పలుకుతూ పురాణపండ శ్రీనివాస్ అమృతలేఖిని నుంచి జాలువారిన రెండు అమోఘ గ్రంధాలను సాయి కొర్రపాటి మహా శివరాత్రి నుండి బళ్ళారి ఆలయానికి విచ్చేస్తున్న వేల కొలది భక్తులకు ఉచితంగా పంచుతూనే ఉండటం ఇప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఆనందం కలిగిస్తోంది.
ఈ ఎన్నికల్లో ప్రలోభాల కోసం కుప్పం, మంగళగిరికి జగన్ రూ.300 కోట్ల చొప్పున పంపారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) సంచలన ఆరోపణలు చేశారు. పాపపు సొమ్ము ఓటుకు రూ.10వేలు ఇస్తారట.. తీసుకోవాలని.. ఓటు మాత్రం కూటమి అభ్యర్థులకు వేయాలని పిలుపునిచ్చారు.
2019లో పరిస్థితి వేరు.. ఇప్పుడు వేరు. ఆ సమయంలో ఒక్క ఛాన్స్ అని ప్రజలను జగన్ అడిగారు. సరేలే అని అవకాశం ఇచ్చి ఉంటారు. ఛాన్స్ ఇస్తే ఏం చేశాడో ఆ జనమే చూశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజా వేదిక కూల్చి తన మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నాడు. తర్వాత విపక్ష నేతలను టార్గెట్ చేశాడు. తొలినాళ్లలో కరెంట్ సమస్య ఎక్కువగా ఉండేది. రహదారుల సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికి రహదారుల మరమ్మతులు జరగలేదు. అందుకే ఈ సారి కూటమి వైపు జనాలు మొగ్గు చూపే అవకాశం ఉంది.
ఓడిపోతే.. ఇక్కడ నాకెందుకులే పనంటూ ఎవరైనా పక్కకు తప్పుకుని పోతారు. కానీ నారా లోకేశ్ అలాకాదు. మరోసారి పోటీలో నిలిచారు.
పేదల వికాసం కాదు మాఫియా వికాసం వైసీపీ సర్కార్ పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. అన్నమయ్య జిల్లా కలికిరిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోదీపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు. మోదీ విశ్వజిత్ అని అభిప్రాయ పడ్డారు. విశ్వజిత్ అంటే విశ్వాన్ని జయించిన వారని వివరించారు. ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా ప్రధాని మోదీ నిలిపారని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన ప్రజాగళం సభలో నారా లోకేశ్ మాట్లాడారు.