Home » Nandyal
Andhrapradesh: టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ బాడీగార్డ్పై దాడి చేసిన ఘటనలో పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఏవీ సుబ్బారెడ్డితో పాటు మరో ఐదుగురిపైనా కేసు నమోదు అయ్యింది. మరోవైపు దాడి ఘటనతో అప్రమత్తమైన పోలీసులు.. భూమా అఖిల ప్రియా, ఏవీ సుబ్బారెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అఖిల ప్రియ బాడీగార్డ్పై దాడి నేపథ్యంలో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
ఆల్లగడ్డలో ఉద్రిక్తత పరిస్థతి నెలకొంది. టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ అనుచరుడు నిఖిల్పై ప్రత్యర్థులు దాడి, హత్యయత్నానికి ప్రయత్నించారు. సినీ పక్కీలో దాడి జరిగింది. మంగళవారం రాత్రి నిఖిల్ తన స్నేహితులతో కలిసి అఖిలప్రియ ఇంటి ముందు ఉన్నారు. ఈ క్రమంలో నిఖిల్ను టార్గెట్ చేసిన దుండగులు కారుతో వేగంగా వచ్చి ఢీ కొట్టారు.
Andhrapradesh: నంద్యాలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిని వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. ఇందులో భాగంగానే డోన్లో పాత కేసులతో టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ప్యాపిలి సింగిల్ విండో డైరెక్టర్ సీమ సుధాకర్ రెడ్డి, వీఆర్వో మల్లారెడ్డి, సుబ్బారెడ్డిలను ఎస్సీ, ఎస్టీ కేసులో ఖాకీలు అదుపులోకి తీసుకున్నారు.
నంద్యాల పోలీసుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నంద్యాల ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి శిల్పా రవి చంద్రకిశోర్ రెడ్డి ఇంటికి హీరో అల్లు అర్జున్ నిన్న (శనివారం) వచ్చారు. ఆ సమయంలో వైసీపీ శ్రేణులు, అల్లు అర్జున్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈ ఘటనపై పోలీసులు అల్లు అర్జున్, శిల్ప రవిపై కేసు నమోదు చేశారు.
Andhrapradesh: ‘‘నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి ఇంటికి ఐకాన్ స్టార్, హీరో అల్లు అర్జున్ వస్తే.. ఎమ్మెల్యే అనుచరులు జనసేన జెండాలు పట్టుకుని తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. ఇది తగునా?. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన పార్టీ జెండాలు పట్టుకొని చీకటి రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల (AP Election 2024) ప్రచారం మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ట్విస్ట్ ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా ఆయన ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షమయ్యారు. నంద్యాల శాసనసభ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి విజయాన్ని కాంక్షించారు.
Andhrapradesh: నంద్యాలలో మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ యువగళం సభకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈరోజు (శుక్రవారం) నంద్యాలలోని రాణి-మహారాణి థియేటర్ వెనుక ప్రాంగణంలో యువగళం సభ జరుగనుంది. రాష్ట్రంలో జగన్ అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువగళం సమరభేరి నిర్వహించనున్నారు.
నంద్యాల: శ్రీశైలంలో లోకళ్యాణార్ధం శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారికి ఆలయ ఈవో పెద్దిరాజు, అధికారులు వార్షిక కుంభోత్సవం నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలో తొలి విడత సాత్వికబలిగా కొబ్బరి, నిమ్మ, గుమ్మడికాయలు సమర్పించారు.
నంద్యాల జిల్లా: నందికొడ్కూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గిత్త జయసూర్య నామినేషన్ వేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన ఆయన నందికొడ్కూర్ తాహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.
నంద్యాల జిల్లా: ఆత్మకూరు పట్టణంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నగరంలోని రఘునాథ్ సెంటర్లో ఓ పాత ఇనుప సామాను గోడౌన్లో భారీగా మంటలు వ్యాపించాయి. మంటల్లోనుంచి భారీ శబ్దాలు రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.