Home » Latest News
ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు (AP Elections 2024) జరుగుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య గట్టి పోటీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పలువురు దేశ, విదేశాల నుంచి ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఓ ఎన్ఆర్ఐ అమెరికా నుంచి వచ్చి ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి మాత్రమే వచ్చారు.
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 10 నెలల క్రితం ఓ డ్రైవర్ అదృశ్యమవగా.. అతను కనిపించకుండా పోవడానికి గల కారణం ఇప్పుడుు తేలింది. ఇంతకాలం పోలీసులు ఎంత వెతికినా కనిపెట్టలేకపోయారు. కానీ.. ఒక మొబైల్ ఫోన్ అసలు రహస్యాన్ని బట్టబయలు చేసింది. 10 నెలల కాలంగా ఆఫ్లో ఉన్న ఫోన్.. ఇప్పుడు ఆన్ కావడంతో..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడైన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
శ్రీకాళహస్తిలో ఈసారి సీన్ రివర్సవుతోంది. ఒకసారి ఓటమి సానుభూతి.. వైసీపీ వేవ్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన మధుసూదన్రెడ్డికి ప్రస్తుతం ఎదురుగాలి వీస్తోంది. విపరీతమైన అవినీతి ఆరోపణలున్నాయి. నిత్య వివాదాస్పద నేతగా ముద్ర వేసుకున్నారు.
దిగ్గజ కంపెనీ గూగుల్ సరికొత్త ఫీచర్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై గూగుల్లో ఏదైనా ఈజీగా సర్చ్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లలో సెర్చ్ చెయ్యడానికి సర్కిల్ టు సెర్చ్ (Circle to search) అనే కొత్త ఫీచర్ను ప్రారంభించింది.
75 ఏళ్ల చరిత్రలో కనివీని ఎరుగని విధంగా కురిసిన అకాల వర్షాలు.. దుబాయ్ను అతలాకుతలం చేశాయి. ఈ వరద బీభత్సానికి ఓ ప్రవాస భారతీయుడు మృతి చెందాడు. రాజన్నసిరిసిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన భాస్కర్ అనే ఓ ప్రవాసీయుడు.. జలప్రళయానికి భయపడి కారులోనే గుండె ఆగి చనిపోయాడు.
జగన్ భస్మాసురుడిలా వ్యవహరిస్తున్నాడని, మే 13న భస్మాసుర వధ జరగాలని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన గాజువాక ప్రజాగళం సభలో ప్రసంగించారు. అవి ఆయన మాటల్లోనే..
Ram Temple in Sukma: నక్సలైట్ల కార్యకలాపాల కారణంగా 21 ఏళ్లపాటు మూతపడిన రామ మందిరం(Ram Temple) ఎట్టకేలకు తెరుచుకుంది. ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) బస్తర్ ప్రాంతంలో(Bastar) గల పురాతన రామాలయ ద్వారాలను మళ్లీ ఇన్నాళ్లుకు తెరిచారు. బస్తర్ డివిజన్లోని సుక్మా జిల్లా(Sukma District) ప్రధాన కార్యాలయం నుండి..
ఏపీలో ముస్లింలకు రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ మైనారిటీ మోర్చా ఏపీ ప్రెసిడెంట్ షేక్ బాజీ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే ముస్లింలకు 4 శాతం ఉన్న రిజర్వేషన్లను (రద్దు)చేస్తారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
తనకు ఎవరూ లేరు అని అంతా అనుకుంటున్నారని, ఇప్పుడు టీడీపీ, జనసేన అండగా ఉన్నాయని, తనకు ఎలాంటి భయమూ లేదని.. పవన్కల్యాణ్ను కూడా హామీ ఇచ్చారని టీడీపీ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. మంగళవారం ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు.