Home » Delhi
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారు. తనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని స్వాతి మాలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. బెయిల్ మీద బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికెళ్లానని స్వాతి మాలివాల్ వివరించారు. ఆ సమయంలో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
అంజన్ ఆద్మీ పార్టీ.. ఆప్కీ అప్నీ పార్టీ.. గరీబ్ ఆద్మీ పార్టీ..! ఇవెక్కడి పార్టీలు..? ఈ పేర్లే వినలేదు ఎప్పుడూ అనుకుంటున్నారా? సరే.. లాగ్ పార్టీ, హమారా సాహి వికల్ప్ పార్టీ.. ఓటర్స్ పార్టీ..! మరి వీటి గురించైనా తెలుసా..
సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్లో దేశవ్యాప్తంగా 69.16 శాతం పోలింగ్ నమోదైంది. గత మూడు దశలలో జరిగిన ఎన్నికల కంటే నాలుగోదశలోనే అత్యధికంగా పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోగా ఓటింగ్కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పెట్టాలంటూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది.
రానున్న రెండు వారాల్లో దేశవ్యాప్తంగా ఓ మోస్తరు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ఈ నెల 19 నాటికే దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ ఇటీవలే తెలిపింది.
ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ తనపై చేసిన దాడిని ఆ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ శుక్రవారం తీస్ హజరీ కోర్టులో వివరించారు. మలివాల్ ఇచ్చిన స్టేట్మెంట్ను కోర్టులో సెక్షన్ 164 కింద మేజిస్ట్రేట్ రికార్డు చేశారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన విషయంలో తామేమీ ప్రత్యేక మినహాయింపు ఇవ్వలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘ఎవరికీ ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. ఏది న్యాయసమ్మతమని భావించామో దానిని మేం మా తీర్పులో స్పష్టం చేశాం’ అని తెలిపింది.
ఇండియా’ కూటమి సభలకు దూరంగా ఉంటున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మరోమారు స్పందించారు. ‘‘ఇండియా కూటమిని నేనే నిర్మించాను. ఆ కూటమిలోనే ఉన్నాను.
లోక్సభ 2024 ఎన్నికలకు(lok sabha elections 2024) ముందే కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ క్రమంలో గుండె, కాలేయం, మధుమేహం సహా అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందుల ధరలను(medicines rates) తగ్గించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.