Home » Bengaluru News
బెంగళూరుకు చెందిన దర్శన్ పటేల్.. తన వివాహానికి కారులో మేళ తాళాలతో కాకుండా జస్ట్.. బైక్పై వెళ్లారు. పెళ్లి కుమార్తె ఇంటి వద్ద కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతోపాటు దర్శన్ పటేల్ సైతం డ్యాన్స్ వేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సీఎం పదవి కోసం డీకే శివకుమార్(DK Shivakumar) ఆత్రుత పడరాదని బీజేపీ నేత, తుమకూరు లోక్సభ అభ్యర్థి సోమణ్ణ(Somanna) సూచించారు. శనివారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘బుల్లెట్ కంటే బ్యాలెట్ బలమైనది’.. ‘మార్పు కోరుకోవడం మాత్రమే సరిపోదు.. మీరు వెళ్లి ఓటు వేయడం ద్వారా మార్పు చేసుకోవాలి’.. ‘బలమైన దేశాన్ని సృష్టించేందుకు మీ ఓటు హక్కును వినియోగించుకోండి’ అనే నినాదలు మనకు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. అయితే, చాలా మంది ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తారు.
ఆన్లైన్ గేమ్స్(Online games)కు బానిసలైన విద్యార్థులు భారీగా ఇంట్లోని నగదు, బంగారు చోరీలకు పాల్పడడం పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేసింది.
రైల్వే ప్రయాణీకులకు జనతా రూ.20కే భోజనం అందించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇండియన్ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ), రైల్వేశాఖ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం 20 రూపాయలకే భోజనాన్ని అందజేయనున్నారు.
నేను మళ్లీ బీజేపీలో చేరుతా, ఎవరూ అడ్డుకోలేరని శివమొగ్గ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసిన బీజేపీ సీనియర్ నేత, మాజీమంత్రి ఈశ్వరప్ప(Former Minister Eshwarappa) సవాల్ విసిరారు. పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు వేయడంపై ఈశ్వరప్ప స్పందించారు.
గరంలోని దేవరజీవనహళ్ళి (డీజే హళ్ళి) పరిధిలో ఓ గుర్రానికి ప్రాణాంతకమైన గ్లాండర్స్(Glanders) జబ్బు నిర్ధారణ అయ్యింది. ఇదో ప్రాణాంతకమైన వైరస్ అని పశుసంవర్ధకశాఖ గుర్తించింది. డీజే హళ్ళి(DJ Halli)లోని ఖలీద్ షరీఫ్ అనే వ్యక్తికి చెందిన గుర్రానికి గ్లాండర్స్ జబ్బు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించామన్నారు.
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) మరోసారి రానున్నారు. ఈనెల 20న శనివారం చిక్కబళ్ళాపుర, బెంగళూరు(Chikkaballapura, Bangalore)లలో అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు.
బిడది సమీపంలో రోడ్డు పక్కన ఉండే ఆస్తిని రాయించుకునేందుకు 9ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన వారికి ఓటేస్తారా.. అంటూ డీసీఎం డీకే శివకుమార్పై పరోక్షంగా మాజీ ప్రధాని దేవెగౌడ(Former Prime Minister Deve Gowda) ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీలతో గ్రామీణ మహిళలు దారి తప్పుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, మండ్య లోక్సభ అభ్యర్థి కుమారస్వామి(Kumaraswamy) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.