Home » AP Govt
ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలను సాగించిన ఏపీ ప్రభుత్వంపై సుప్రీం ధర్మాసనం మండిపడింది. అక్రమ ఇసుక తవ్వకాలను నిలిపివేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.
Andhrapradesh: ఏపీలో యుద్ధ ప్రాతిపదికన కాలువలకు మరమ్మతులు చేపట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాలువల నిర్వహణ పనులపై గత అయిదేళ్లుగా దృష్టిపెట్టలేదని విమర్శించారు. సాగు నీటి అవసరాలు తీర్చే కాలువలు, వాటికి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలకు అవసరమైన నిర్వహణ, మరమ్మతులు వేసవి సమయంలో చేపట్టాలన్నారు.
Andhrapradesh: ఈసీ నిర్ణయాన్ని అపహస్యం చేసే విధంగా జగన్ సర్కార్ వ్యవహరిస్తోందని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల నిధుల విడుదలపై ఈసీ నిన్న (గురువారం) స్పష్టంగా ఆర్డర్ ఇచ్చిందని.. జగన్ ఆరు స్కీమ్స్కు బటన్ నొక్కితే డబ్బులు పడలేదన్నారు. లబ్ధిదారులకు డబ్బులు లేవని.. సాక్షికి మాత్రం ప్రకటనలు ఇస్తారని మండిపడ్డారు.
Andhrapradesh: సంక్షేమ పథకాలకు నిధులు విడుదలపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండి లేఖ రాసింది. నిధుల విడుదలలో అనేక ప్రశ్నలు లేవనెత్తుతూ సీఎస్కు లేఖ రాసింది. రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని డీబీటీ పథకాల అమలవుతున్నాయా? అని ప్రశ్నించింది. జనవరి 2024 నుంచి మార్చి 2024 వరకు పథకాలకు నిధులు ఇవ్వలేని ప్రభుత్వం పరిస్థితి ఒక్కసారిగా ఎలా మారిందని..
Andhrapradesh: ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించి జగన్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని రాష్ట్ర సర్కార్కు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అక్రమ ఇసుక తవ్వకాలను తక్షణం నిలిపివేయడానికి వెంటనే అధికారుల బృందాలను క్షేత్రస్థాయికి పంపాలని ఉన్నతన్యాయస్థానం ఆర్డర్స్ పాస్ చేసింది.
Andhrapradesh: సంక్షేమ పథకాలకు నిధుల విడుదలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. సంక్షేమ పథకాలకు నిధులు నిలిపివేతపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్లు దాఖలు చేసింది. ఈరోజు (గురువారం) హైకోర్టులో విచారణ జరుగగా.. ఎన్నికల కమిషన్, ప్రభుత్వం తరపున వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది.
ఎన్నికల కమిషన్ పథకాలకు నిధుల విడుదలను నిలిపివేసిందని హైకోర్టులో జగన్ ప్రభుత్వం లంచ్ మోషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఏపీ హైకోర్టులో ఈ కేసులో జగన్ ప్రభుత్వానికి (Jagan Govt) ఊరట దక్కలేదు. లంచ్ మోషన్ పిటీషన్పై మంగళవారం సాయంత్రం విచారణ జరిగింది.
Andhrapradesh: పెన్షనర్లకు సకాలంలో పెన్షన్లు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని.. ఇది దుర్మార్గమైన చర్య అంటూ మండిపడ్డారు. పెన్షనర్లు అనేక మంది మృతి చెందారని.. పెన్షనర్ల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అని వ్యాఖ్యలు చేశారు.
Andhrapradesh: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన ట్వీట్పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడిని అంటూ పీవీ రమేష్ ట్వీట్ చేశారు. కృష్ణా జిల్లా, విన్నకోట గ్రామంలో తన తల్లిదండ్రులకు చెందిన భూముల మ్యుటేషన్కు తాను ఇబ్బంది పడ్డానని రమేష్ తెలిపారు.
Andhrapradesh: ఏపీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎంతటి దుమారాన్ని రేపుతుందో అందరికీ తెలిసిందే. ల్యాండ్ టైటిల్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో భూవివాదాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ యాక్ట్పై మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ సంచలన ట్విట్ చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్లో తాను బాధితుడినే అని పేర్కొన్నాడు.