Home » Andhrapradesh
Telangana: మే 13న పోలింగ్, వరుసగా మూడు రోజులు సెలవులు. ఇంకేముంది ప్రజలంతా సొంతూళ్ల బాట పట్టారు. వీకెండ్తో పాటు సోమవారం పోలింగ్ నేపథ్యంలో తెలుగు ప్రజలు పల్లెలకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో బస్టాండ్లకు చేరుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది వెళ్లిపోగా.. మరికొందరు ఈరోజు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఎంజీబీఎస్ వద్ద సొంతూళ్లకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్న వారితో బస్టాండ్ కిక్కిరిసి పోయింది.
Telangana: భాగ్యనగరం ఖాళీ అవుతోంది. ఓట్లు వేసేందుకు తెలుగు ప్రజలు తమ తమ సొంతూర్లకు తరలివెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరం సగానికి పైగా ఖాళీ అవుతున్న పరిస్థితి. సొంతూర్లకు వెళ్లేందుకు ప్రజలు బస్టాండ్లకు తరలివెళ్తున్నారు. దీంతో జేబీఎస్ బస్టాండ్ వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోవడానికి ఇదే ఆఖరి అవకాశమని సినీ హీరో శివాజీ వ్యాఖ్యానించారు. కూటమికి ఎందుకు ఓటు వేయాలన్న అంశంపై.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడారు.
‘బయట పల్లకీల మోత... ఇంట్లో ఈగల మోత’.. రాష్ట్రంలోని అగ్రవర్ణాల్లో (ఈబీసీలు) చాలా కుటుంబాల పరిస్థితి దాదాపుగా ఇంతే! మధ్యతరగతి పేరిట దారిద్య్రం అనుభవిస్తున్న వర్గాలివి.
అలనాటి పల్నాటి పోరు కేంద్రమైన మాచర్లలో ఈ సారి హోరాహోరీ పోరు నెలకొంది. సమవుజ్జీలైన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నేత జూలకంటి బ్రహ్మానందరెడ్డి నడుమ పోరు ప్రతిష్ఠాత్మకంగా సాగుతోంది.
మీ వాడకం ఇట్టా ఉంటుందని ఊహించలేదు నాయకా! కుటుంబ సభ్యులను, పార్టీ నేతలను, ఐఏఎ్సలను, ఐపీఎ్సలను, సోకాల్డ్ తటస్థ మేధావులను... చివరికి తిరుమల వెంకన్న స్వామినీ వదలకుండా వాడుకోవడం మీ ఒక్కరికే సాధ్యం!.... ఇది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి దక్కిన ఘనత!
Andhrapradesh: సమాజంలో అందరూ రూల్ ఆఫ్ లా పాటించాలని సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నేరాలు పెరిగాయని లెక్కలు చెబుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీ మార్చిందని... మద్యం డిస్టలరీస్ను ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు. దీంతో పిచ్చి పిచ్చి బ్రాండ్లు తయారు చేస్తున్నారని..
దార్శనికులు ఉజ్వల భవిష్యత్కు, అభివృద్ధికి బాటలు వేస్తారు. సంపద, ఉపాధి చేకూరుస్తారు. నాయకుడికి ఇలాంటి లక్షణాలే ఉండాలి. అలాంటి నాయకుడే చంద్రబాబు. అదే విధ్వంసకారులు నాయకులైతే... కట్టడాలను కూల్చడం, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, దోపిడీలతో అల్లకల్లోలం చేస్తారు. ఈ తరహా దమననీతి, ఫ్యూడల్ హింస లక్షణాలు పుష్కలంగా ఉన్న నాయకుడే జగన్మోహన్రెడ్డి.
ఎన్నికల తర్వాత దేశంలో పెనుమార్పులు వచ్చే అవకాశం ఉందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. గురువారం విజయవాడలో విలేకరుల సమావేశంలో, ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ అల్లూరి జిల్లా కూనవరంలో నిర్వహించిన బహిరంగ సభలోనూ ఆయన మాట్లాడారు.
భారతదేశానికి స్వాతంత్య్రం రాకమునుపు ఎన్నికల ప్రచార పత్రాలు ఎలా ఉండేవి అనే దానికి ఫొటో సాక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక మునుపు మదరాసు శాసన నిర్మాణ సభకు వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులు పోటీ చేసేవారు.