Home » Anantapur
Andhrapradesh: ఏపీ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కొన్ని చోట్ల మాత్రం ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్ ఆలస్యమైంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు వేచి ఉన్నారు. చాలా చోట్ల ఈవీఎంల మొరాయింపులతో పోలింగ్ ప్రారంభంకాని పరిస్థితి. పోలింగ్ మొదలై గంట గడిచినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం ఇంకా పోలింగ్ ప్రారంభంకాలేదు.
పోలింగ్ రిజర్వ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. పోలింగ్ రోజున రిజర్వ్ స్టాఫ్ రావాలని అధికారులు ఆదేశించారు. ఉదయం నుంచే రిజర్వ్ సిబ్బంది డీఆర్సీ కార్యాలయం వద్ద వేచి ఉన్నారు. రిజర్వ్స్టా్ఫకు పోలింగ్ కేంద్రాలను అధికారులు కేటాయించలేదు.
ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్, ఎస్పీ అమితబర్దర్ కోరారు. పట్టణంలోని జిల్లా పరిషత బాలికల ఉన్నత పాఠశాల, తొండపాడు గ్రామంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలను ఆదివారం సాయంత్రం వారు పరిశీలించారు.
పట్టణంలోని బాహర్ పేట్ ఉర్దూ పాఠశాలలో ఏర్పాటుచేసిన 182వ పోలింగ్ కేంద్రం వద్ద ఆదివారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల అధికారులు సోమవారం ఉదయం పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో బాక్సు నుంచి ఈవీఎంలను బయటకు తీయాల్సి ఉండగా ఏపీఓ హేమచంద్రారెడ్డి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఈవీఎం సీల్ను తొలగించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. ఓటర్ల క్యూలైన్ల కోసం బారికేడ్ల ఏర్పాటు, నీడకోసం షామియానాల ఏర్పాటులో నిర్లక్ష్యం వహించారు. అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న పోలింగ్ కేంద్రాల వద్ద వసతుల కల్పనపై పర్యవేక్షించడంతో లోపాలు బయటపడ్డాయి.
అనంతపురం జిల్లా: పెనుకొండ వైసీపీ అభ్యర్థి మంత్రి ఉషశ్రీ చరణ్.. భర్త చరణ్ రెడ్డి భాగోతం బట్టబయలైంది. బెంగళూరులో మేనమామ జగన్నాథ్కు చెందిన కోట్ల రూపాయల విలువ చేసే ఇంటిని చరణ్ రెడ్డి కాజేసారు.
Andhrapradesh: జిల్లాలో అర్ధాతరంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ బూత్లు మూసివేశారు. గడువు ఉండగానే పోలింగ్ బూత్లు మూసివేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని జూనియర్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ బూత్లను అధికారులు మూసివేశారు. అయితే పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నేటి వరకు గడువు ఉంది.
Andhrapradesh: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. మండుటెండల్లోనే రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు రోజుల వ్యవధే ఉండటంతో ఎండలను కూడా లెక్క చేయకుండా అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే మండే ఎండల్లో ప్రచారం నిర్వహిండచంతో పలువురు అభ్యర్థులు కాస్త అనారోగ్యానికి గురవుతున్నారు..
పొలిటిల్ విశ్లేషకులు భావించినట్లుగానే జరిగింది. మొదట పోలీస్ బాస్పై(AP DGP) వేటు పడింది.. ఆ తరువాత జిల్లా స్థాయి అధికారులపై వేటు పడుతోంది. తాజాగా అనంతపురం(Anantapur) జిల్లా డీఐజీపై(DIG) బదిలీ వేటు పడగా.. ఇప్పుడు మరింత ఉత్కంఠ నెలకొంది. నెక్ట్స్ చర్యలు ఎవరిపైనా? అని ప్రభుత్వ వర్గాల్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది.
‘బస్సులు పెడ్తున్నం.. బేగి బయల్దేరండి’ అంటూ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఓటు హక్కు ఉన్న హైదరాబాద్ వాసులకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల నుంచి ఫోన్కాల్స్ వెల్లువెత్తుతున్నాయి..