Share News

Odisha: ఒడిశాలో విషాదం.. పడవ మునిగిన ఘటనలో 50 మంది...

ABN , Publish Date - Apr 20 , 2024 | 07:09 PM

ఒడిశాలో(Odisha) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఝార్సుగూడ జిల్లాలోని మహానదిలో(Mahanadi) జరిగిన పడవ ప్రమాదంలో 7 మంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని ఖర్సియాకి చెందిన 50 మందికిపైగా ప్రయాణికులు బార్‌ఘర్ జిల్లా పథర్సేని కుడాలోని ఆలయాన్ని సందర్శించి పడవలో తిరిగి వస్తున్నారు.

Odisha: ఒడిశాలో విషాదం.. పడవ మునిగిన ఘటనలో 50 మంది...

భువనేశ్వర్: ఒడిశాలో(Odisha) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఝార్సుగూడ జిల్లాలోని మహానదిలో(Mahanadi) జరిగిన పడవ ప్రమాదంలో 7 మంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని ఖర్సియాకి చెందిన 50 మందికిపైగా ప్రయాణికులు బార్‌ఘర్ జిల్లా పథర్సేని కుడాలోని ఆలయాన్ని సందర్శించి పడవలో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా పడవ బోల్తా పడింది. దీంతో అందులోని 50 మంది నదిలో మునిగిపోయారు.

వారిలో కొందరు ఈదుతూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు నిలుపుకోగా 7 మంది ఈత రాక మునిగిపోయారు. జార్సుగూడ జిల్లా రెంగలి పోలీస్ స్టేషన్ పరిధిలోని శారదా ఘాట్ వద్దకు చేరుకోగానే బోటు బోల్తా పడినట్లు తెలుస్తోంది. మత్స్యకారులు 35 మంది ప్రయాణికులను రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు.


విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మరో 13 మందిని రక్షించారు. 7 మంది గల్లంతయ్యారని.. వారిని వెతికేందుకు సర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఎస్పీ స్మిత్ పర్మార్ మాట్లాడుతూ.. "ఓడీఆర్ఎఎఫ్ బృందం, స్కూబా డైవర్లను రప్పించాం. రెస్క్యూ ఆపరేషన్ నిరంతరం కొనసాగుతోంది. ఏడు మృతదేహాలను వెలికితీశాం. వైద్యులను కూడా సంఘటన స్థలానికి పిలిపించాం. మరో మృతదేహాన్ని బయటకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇద్దరు బోట్‌మెన్‌లను అదుపులోకి తీసుకున్నాం. ఘటనకు కారణమైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం" అని తెలిపారు. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో స్కూబా డైవర్లు, సెర్చ్ కెమెరాలను ఘటనాస్థలికి తరలించారు.

PM Modi: రాహుల్.. నిన్ను వాయనాడ్ నుంచి తరిమికొడతారు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు


కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా..

పడవ ప్రమాద ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఆదుకుంటామని నవీన్ అన్నారు. ఘటనకు కారణమైన వారిపై కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఘటనా స్థలానికి చేరుకున్న బార్‌గఢ్ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత సురేష్ పూజారి మాట్లాడుతూ.. "గడువు ముగిసిన లైసెన్స్‌తో ఏళ్లుగా బోటు నడిపారు. దానికి అధికారులు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా బోటుకు యథేచ్ఛగా అనుమతులు ఇచ్చారు. దీనికితోడు పరిమితికి మించి 50 మందిని బోట్లో ఎక్కించడంతోనే ప్రమాదం జరిగింది" అని ఆరోపించారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 20 , 2024 | 07:10 PM