Share News

ఆశీర్వదించండి.. ప్లీజ్‌!

ABN , Publish Date - May 04 , 2024 | 06:19 AM

హైదరాబాద్‌ మజ్లిస్‌ అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ గురువారం రాత్రి మూసారాంబాగ్‌ బస్తీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం పక్క నుంచి వెళ్లారు.

ఆశీర్వదించండి.. ప్లీజ్‌!

హైదరాబాద్‌ మజ్లిస్‌ అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ గురువారం రాత్రి మూసారాంబాగ్‌ బస్తీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం పక్క నుంచి వెళ్లారు.

ఆ సమయంలో అసదుద్దీన్‌ను ఆశీర్వదించాలని, ఆయనకు పూలమాల వేయాలని మూసారాంబాగ్‌ మాజీ కార్పొరేటర్‌ అస్లాం, ఇతర మజ్లిస్‌ నాయకులు ఆలయ అర్చకులను కోరారు.

దాంతో, వారు పూలమాల వేశారు. ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అలాగే, బీజేపీ అభ్యర్థులు కిషన్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌, మాధవీలత, కంటోన్మెంట్‌ అసెంబ్లీ అభ్యర్థి వంశా తిలక్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ శుక్రవారం హైదరాబాద్‌ ఆర్చి డయాసిస్‌ బిషప్‌, కార్డినల్‌ పూల ఆంథోనీని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

- రెజిమెంటల్‌ బజార్‌, ఆంధ్రజ్యోతి

Updated Date - May 04 , 2024 | 06:19 AM