హైటెక్ ప్రచారం
ABN , Publish Date - May 04 , 2024 | 04:46 AM
ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. చిత్తూరులో టీడీపీ కార్యకర్తలు సోలో వీల్స్తో కలియ తిరుగుతుంటే..
ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. చిత్తూరులో టీడీపీ కార్యకర్తలు సోలో వీల్స్తో కలియ తిరుగుతుంటే.. పట్టణాల్లోని వీధుల్లో టీడీపీ కార్యకర్తలు వీపులకు డిజిటల్ డిస్ప్లే బోర్డులు తగిలించుకుని ప్రచారం చేస్తున్నారు. పగటిపూట మామూలుగా కనిపించే ఈ బోర్డులు.. రాత్రి సమయంలో వాటిలో అమర్చిన బ్యాటరీలతో వెలుగులు విరజిమ్ముతూ.. ప్రజలను ఆకర్షిస్తున్నాయి.